ఈ క్రాప్ నమోదు కార్యక్రమాన్ని పర్యవేక్షించిన ఏడిఏ

79చూసినవారు
ఈ క్రాప్ నమోదు కార్యక్రమాన్ని పర్యవేక్షించిన ఏడిఏ
జామి మండలం లక్ష్మీపురంలో ఏవో కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ క్రాప్ నమోదు కార్యక్రమాన్ని ఏడిఏ విజయ మంగళవారం పర్యవేక్షించారు. అనంతరం రైతులకు ఈ క్రాప్ నమోదుపై అవగాహన కల్పించారు. ప్రతి రైతు తమ పంటకు ఈ క్రాప్ విధిగా నమోదు చేసుకోవాలని తెలిపారు. ఈ క్రాప్ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆమె ఆదేశించారు. కార్యక్రమంలో స్థానిక విఏఏ లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్