బొబ్బిలి డీఎస్పి మోహన్ రావుకు ఘనంగా సన్మానం

1758చూసినవారు
బొబ్బిలి డీఎస్పి మోహన్ రావుకు ఘనంగా సన్మానం
బొండపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవలీ ఫోక్సో కేసు నమోదు కాబడిన నేపథ్యంలో గంటల వ్యవధిలోనే దర్యాప్తును పూర్తి చేసి అనంతరం నేరస్తులకు శిక్షపడేలా విధి నిర్వహణలో కృషిచేసిన బొబ్బిలి డిఎస్పి మోహన్ రావు సేవలను గుర్తించి విజయనగరం జిల్లా ఎస్పీ దీపికా పాటిల్ చేతుల మీదుగా ఉత్తమ పోలీస్ అధికారిగా అవార్డును అందుకున్న నేపధ్యంలో బొబ్బిలికి చెందిన న్యాయవాది, సామాజిక కార్యకర్త తుమరాడ గంగాధర్ ఆధ్వర్యంలో గురువారం డిఎస్పీ కార్యాలయంలో స్థానిక న్యాయవాది బి ఎస్ ఆర్ మూర్తి, జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు ముగడ వెంకటరమణ, బొబ్బిలి నియోజకవర్గ విశ్వబ్రాహ్మణ అధ్యక్షులు మునగపాటి బంగార్రాజు, వేద పురోహితులు పాలకొల్లు రామారావు, తదితరులు డిఎస్పిని గౌరవంగా కలిసి దుశ్శాలు, పుష్పగుచ్ఛంతో సత్కరించారు. ఈ సంధర్భంగా గంగాధర్ మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను నిర్మూలన చేసేలా చేస్తున్న కృషిని గూర్చి కొనియాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్