![పారదర్శకంగా రైతు సేవే ప్రభుత్వ ధ్యేయం పారదర్శకంగా రైతు సేవే ప్రభుత్వ ధ్యేయం](https://media.getlokalapp.com/cache/27/d8/27d893c4fa8d101680899efc02c44bed.webp)
పారదర్శకంగా రైతు సేవే ప్రభుత్వ ధ్యేయం
రైతన్నలకు పారదర్శకంగా సేవలు అందించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన తెలిపారు. శుక్రవారం స్థానిక రైతుసేవా కేంద్రంలో రాయితీ ఎరువులు పంపిణీ కోసం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని ఎరువులు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించే పంటలకు ప్రాదాన్యత ఇవ్వాలనీ ప్రకృతి వ్యవసాయాన్ని, సేంద్రియ పద్ధతులు అవలంబించి అధిక దిగుబడులు సాధించాలని సూచించారు.