సూపర్ సిక్స్ మేనిఫెస్టోతో రాష్ట్ర ప్రజలకు న్యాయం జరుగుతుందని టిడిపి, జనసేన, బిజెపి ఉమ్మడి అభ్యర్థి బేబినాయన అన్నారు. మున్సిపాలిటీలోని గొల్లపల్లిలో సోమవారం ఎన్నికల ప్రచారం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు కోసమే టీడీపీ, జనసేన, బిజెపి కూటమి సూపర్ సిక్స్ మ్యానిఫెస్టోను ప్రకటించిందన్నారు. రాష్ట్రంలో వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత అరాచక పాలన చేసి అభివృద్ధి చేయలేదన్నారు.