ఆసుపత్రిల అభివృద్ధికి నిధులు విడుదల చేయండి: బేబీ నాయన

75చూసినవారు
ఆసుపత్రిల అభివృద్ధికి నిధులు విడుదల చేయండి: బేబీ నాయన
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై. సత్య కుమార్ యాదవ్ ని బొబ్బిలి ఎమ్మెల్యే బేబినాయన మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా తిరుమల స్వామివారి ప్రసాదాన్ని మంత్రికి అందజేశారు. బొబ్బిలి పట్టణంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల వైద్య శాలగా మార్చాలని, అదేవిదంగా బాడంగిలో అసంపూర్తిగా ఉన్న ఆసుపత్రిని పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి వచ్చేలా చూడాలని కోరారు. మంత్రి సానుకూలంగా స్పందించినట్టు తెలిపారు.

సంబంధిత పోస్ట్