రాజచెరువు వలస గిరిజన గ్రామంలో సరస్వతీ దేవికి ప్రత్యేక పూజలు

51చూసినవారు
రాజచెరువు వలస గిరిజన గ్రామంలో సరస్వతీ దేవికి ప్రత్యేక పూజలు
బొబ్బిలి మండలంలోని రాజచెరువువలస గ్రామంలో బుధవారం సమరసతా సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాలవికాస కేంద్రంలో సరస్వతీదేవి ఉద్భవించిన మూలా నక్షత్రం, దేవి శరన్నవరాత్రులు 7వరోజు సందర్భంగా బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా ధర్మ ప్రచారక్ ధూపం వాసు మాట్లాడుతూ దసరా నవరాత్రుల్లో మూలా నక్షత్రానికి ప్రత్యేకమైన విశిష్టత ఉందనీ, ఇది అమ్మవారి జన్మనక్షత్రం అన్నారు. సరస్వతీ దేవి అలంకారాన్ని దర్శించుకోవడమే మహాభాగ్యంగా భావిస్తారన్నారు.

సంబంధిత పోస్ట్