తెలుగు మాధ్యమాన్ని కూడా కొనసాగించాలి

968చూసినవారు
తెలుగు మాధ్యమాన్ని కూడా కొనసాగించాలి
నూతన విద్యా సంవత్సరం ప్రారంభంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన విద్యా సంస్కరణల్లో భాగంగా విద్యా ప్రమాణాలు పెంపొందించడానికి అమ్మఒడి విద్యా దీవెన, వసతి దీవెన లాంటి పథకాలు హర్షించినప్పటకీ మరి ప్రత్యేకంగా ప్రభుత్వ పాఠశాలలో సీబీఎస్ఈ సిలబస్ పేరుతో ఇంగ్లీష్ మాధ్యమాన్ని ప్రోత్సహించడమనేది స్వాగతించే విషయం అయినా కూడా మరో ప్రక్కన తెలుగు మాద్యం పూర్తిగా అంతరించిపోయే అవకాశం ఉన్నందున ప్రభుత్వం మరోసారి పునరాలోచన చేసి తెలుగు నేలపై తెలుగు భాష సంస్కృతిని కాపాడుతూ ఆసక్తి కలిగిన విద్యార్థులకు తెలుగు మాధ్యమాన్ని కూడా కొనసాగించాలని బొబ్బిలిలో సామాజికవేత్త న్యాయవాది తుమరాడ గంగాధర్ తమ కార్యాలయంలో మీడియాతో అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్