వైభవంగా విష్ణు సహస్ర స్తోత్ర పారాయణం

71చూసినవారు
గజపతినగరంలోని శ్రీరామక్షేత్రం జంక్షన్ లో గల శ్రీనివాస సీతారామస్వామి ఆలయం ప్రాంగణంలో తొలి ఏకాదశి పురస్కరించుకొని బుధవారం మధ్యాహ్నం మహిళలు విష్ణు సహస్ర స్తోత్రం పారాయణం కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ముందుగా కల్యాణ వెంకటేశ్వర స్వామికి ఆలయ అర్చకులు పీసపాటి శ్రీనివాసాచార్యులు ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ గావించారు.

సంబంధిత పోస్ట్