పార్వతీపురం నుంచి గుణుపూర్ వెళ్లే రహదారిలో నందివానివలస గ్రామం రైస్ మిల్లు దగ్గర ఏనుగుల గుంపు మంగళవారం హల్చల్ చేస్తోంది. కొన్నేళ్లుగా మన్యం జిల్లాలో ఏనుగుల వల్ల ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరుగుతూనే ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమీప అడవుల్లోకి వాటిని తరలించి తమను రక్షించాలని ప్రజలు కోరుతున్నారు. అయితే అటవీ శాఖ అధికారులు వాటి దగ్గరికి ఎవరినీ రాకుండా చూసుకుంటున్నారు.