గోతులమయంగా ఉల్లిభద్ర ప్రధాన రహదారి

71చూసినవారు
పార్వతిపురం నుంచి శ్రీకాకుళం వెళ్లే ప్రధాన రహదారిలో గరుగుబిల్లి మండలం ఉల్లిభద్ర సెంటర్ తోటపల్లి ప్రధాన కాలువ దగ్గర రోడ్డు గోతులమయం అయింది. ఇటీవల తూతూ మంత్రంగా కంకరి మట్టితో గోతుల్ని పూడ్చి వేశారు. అయితే ఈ మధ్య కురిసిన వర్షాలకు గోతులలో మట్టి అంతా బురదమయం అయింది. దీంతో వాహనదారులు జారి పడిపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ గోతులకు శాశ్వత పరిష్కారం చూపాలని వాహనదారులు బుధవారం కోరారు.

సంబంధిత పోస్ట్