ప్రత్యేక ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే

83చూసినవారు
ప్రత్యేక ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే
గుమ్మలక్ష్మీపురం మండలం గొయిపాకలో ఎమ్మెల్యే జగదీశ్వరి ప్రత్యేక ప్రజా దర్బార్ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. పంచాయితీ పరిధిలోని గ్రామాల ప్రజలందరూ నేరుగా తమ సమస్యలను ఎమ్మెల్యేకు విన్నవించగా కొన్ని వెంటనే పరిష్కరించారు. వెంటనే పరిష్కారం కాని సమస్యలను సంబంధిత అధికారులకు బదిలీ చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. టీడీపీ మండల కన్వీనర్ సుదర్శనరావు, సర్పంచ్ లక్ష్మి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్