గరుగుబిల్లి మండలం తోటపల్లి గ్రామంలో ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి పర్యటించారు. శనివారం చిన తిరుపతిగా పేరు గాంచిన తోటపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం తోటపల్లి సేవ ట్రస్ట్ లో సభ్యునిగా నియమితులయ్యారు. స్వామి వారి ఆలయ ఆవరణంలో షేడ్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నేతలు పాల్గొన్నారు.