అక్టోబర్ 2 స్వచ్ఛ భారత్ దినోత్సవం

76చూసినవారు
అక్టోబర్ 2 స్వచ్ఛ భారత్ దినోత్సవం
స్వచ్ఛ భారత్ దినోత్సవం సందర్భంగా అక్టోబర్ 2 వరకు మన్యం జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛతా హి సేవ 2024 నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. మహాత్మా గాంధీ వారసత్వాన్ని గౌరవిస్తూ, స్వచ్ఛతను జీవన విధానంగా మార్చుకునేలా సమష్టిగా ముందడుగు వేయవలసిన అవశ్యకత ఉందన్నారు. జిల్లా స్ధాయిలో భాగస్వామ్య సంస్ధలతో ఇప్పటికే ఉన్నత స్ధాయి సన్నాహక సమావేశం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్