తోటపల్లి బ్యారేజ్ రెండు గేట్ల నుండి నీరు విడుదల

65చూసినవారు
తోటపల్లి బ్యారేజ్ రెండు గేట్ల నుండి నీరు విడుదల
గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం, తోటపల్లి జలాశయానికి భారీగా వరద నీరు చేరింది. వరద నీరు అధికంగా చేరడంతో తోటపల్లి బ్యారేజ్ రెండు గేట్లను మంగళవారం అధికారులు ఎత్తివేశారు. 9వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. దీంతో తోటపల్లి బ్యారేజీ నిండుకొండును తలపిస్తోంది. బ్యారేజిలో వరద ప్రవాహాన్ని చూడటానికి పర్యటకుల రాకతో ఆప్రాంతం సందడి నెలకొంది.

సంబంధిత పోస్ట్