డెంకాడ మండలం పినతాడివాడ సచివాలయానికి చెందిన 11 మంది వలంటీర్లు బుధవారం మూకుమ్మడి రాజీనామాలు సమర్పించారు. ఈ మేరకు పంచాయతీ కార్యదర్శికి రాజీనామా పత్రాలు సమర్పించారు. వారు మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారిధిలా పనిచేస్తూ పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందిస్తున్న తమపై టిడిపి, జనసేన నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పారు. దీంతో మనస్థాపంతో రాజీనామా పత్రాలు సమర్పించినట్లు చెప్పారు.