విజయనగరంలో 153, పార్వతీపురం మన్యంలో 52 మద్యం దుకాణాలు

52చూసినవారు
విజయనగరంలో 153, పార్వతీపురం మన్యంలో 52 మద్యం దుకాణాలు
ప్రభుత్వ మద్యం షాపులు రద్దయ్యాయి. ప్రైవేటు మద్యం దుకాణాల ఏర్పాటు, పెంపు, ధరలు, దరఖాస్తుల స్వీకరణ, లైసెన్సు ఫీజులు తదితర అంశాలపై ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీచేసింది. దీని ప్రకారం విజయనగరం జిల్లాలో నాలుగు దుకాణాలు పెరిగాయి. దీంతో, ఇప్పటి వరకు 149గా ఉన్న మద్యం దుకాణాల సంఖ్య 153కు చేరింది. మన్యం జిల్లాలో కొత్త, పాత కలుపుకుని 52 ఏర్పాటు కానున్నాయి. ఈనెల 9వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.

సంబంధిత పోస్ట్