ఇంటర్మీడియెట్ పబ్లిక్
పరీక్షలు నిర్వహణకు కావలసిన ఏర్పాట్లు పూర్తిచేయాలని పార్వతీపురం మన్యం జిల్లా రెవిన్యూ అధికారి జె. వెంకటరావు తెలిపారు. పరీక్షల నిర్వహణకు ముందస్తు ఏర్పాట్లలో భాగంగా సోమవారం కలెక్టరు కార్యాలయంలో జిల్లా స్థాయి పరీక్షల కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పరీక్షల నిర్వహణలో భాగమైన వివిధ శాఖల ముందస్తు ఏర్పాట్లపై జిల్లా రెవిన్యూ అధికారి సమీక్ష నిర్వహించారు.