మన్యం జిల్లా రవాణా అధికారిగా దుర్గా ప్రసాద్

62చూసినవారు
మన్యం జిల్లా రవాణా అధికారిగా దుర్గా ప్రసాద్
జిల్లా రవాణా అధికారిగా టీ దుర్గాప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు మంగళవారం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ ను కలెక్టర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. రవాణా వ్యవస్థ చక్కగా నిర్వహణకు అన్ని చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. ఇసుక రవాణాకు వాహనాలను నమోదు చేయాల్సిన అవసరం ఉందని, అదేవిధంగా రానున్న ధాన్యం సేకరణ సమయంలోను తగు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్