పెద అంకలాంలో వృద్ధురాలి నేత్రదానం

57చూసినవారు
పెద అంకలాంలో వృద్ధురాలి నేత్రదానం
మన్యం జిల్లా సీతానగరం మండలంలోని పెద అంకలాం గ్రామానికి చెందిన వారణాశి అప్పల నరసమ్మ(82) జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అనారోగ్యరీత్యా మరణించింది. అయితే జిల్లాలో నిర్వహించిన నేత్రదానం పక్షోత్సవాల్లో మరణానంతరం నేత్రాలను దానం చేయాలని ఆమె నిర్ణయించుకున్నారు. దీంతో గురువారం విజయనగరం ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థ నేత్ర నిధిని సంప్రదించగా వృద్ధురాలి రెండు కార్నియాలు సేకరించారు.

సంబంధిత పోస్ట్