ఉపాధి హామీ పథకంలో చేపట్టిన ప్రతి పని దగ్గర పని సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగిందని మన్యం జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరక్టర్ కె రామచంద్ర రావు తెలిపారు. ఫిబ్రవరి నెల వరకు వరకు ప్రతి వేతనదారుడికి వేతనం ఖాతాల్లో జమ చేయడం జరిగిందన్నారు. బుధవారం గరుగుబిల్లి మండలంలో గొట్టిపలని, రావుపల్లి, ఇతర పంచాయతీలలో జరుగుతున్న పనులను పరిశీలించడం జరిగిందన్నారు.