టీడీపీ అధినేత చంద్రబాబుపై పిఠాపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీత ఆగ్రహం వ్యక్తం చేశారు. "గతంలో వాలంటీర్లను చంద్రబాబు తీవ్రంగా అవమానించాడు. ఇవాళ తన రాజకీయ లబ్ధి కోసం వాలంటీర్లను కొనసాగిస్తామని చెబుతున్నారు. వాలంటీర్లపై వేరే రాగం.. వేరే శృతి కలుపుతున్నారు. చంద్రబాబుకు రాజకీయం తప్ప.. ప్రజా సేవ, ప్రజలను గౌరవించడం తెలియదు." అని ఆమె విమర్శించారు.