మీసేవ ఉద్యోగులు మంత్రి సంధ్యారాణికి వినతిపత్రం

56చూసినవారు
మీసేవ ఉద్యోగులు మంత్రి సంధ్యారాణికి వినతిపత్రం
మీసేవ ఉద్యోగులు రాష్ట్ర మంత్రి గుమ్మడి సంధ్యారాణిను ఆదివారం ఆమె నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. సాలూరు మీ సేవ కేంద్రంలో 2003 నుండి 2020 వరకు ఉద్యోగులుగా సేవలందించామని, ఆ తర్వాత గత ప్రభుత్వం నిలుపుదల చేసిందని మరలా మమ్మల్ని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుగా పరిగణించాలని మంత్రి కి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో సాలూరు మీసేవ మేనేజర్ వాడడం రవిశంకర్ ఆపరేటర్ మజ్జి తిరుమల రావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్