ఎస్ కోటలో మలేరియా వ్యతిరేక మాసోత్సవ ర్యాలీ

50చూసినవారు
ఎస్ కోటలో మలేరియా వ్యతిరేక మాసోత్సవ ర్యాలీ
ఎస్ కోట స్థానిక పీహెచ్సీ డాక్టర్ శిరీష ఆధ్వర్యంలో బుధవారం మలేరియా వ్యతిరేక మాసోత్సవాలను నిర్వహించారు. ఈ మేరకు స్థానిక జీజే కాలేజీ నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు కళాశాల విద్యార్థులతో ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎం పి హెచ్ ఓ శ్రీనివాసరావు, కళాశాల ప్రిన్సిపాల్ కృష్ణమూర్తి, హెల్త్ అసిస్టెంట్లు శంకర్, రామకృష్ణ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్