సీజనల్ వ్యాధులు పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలి

82చూసినవారు
సీజనల్ వ్యాధులు పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలి
సీజనల్ వ్యాధులు పట్ల గ్రామీణ ప్రాంతాల్లో ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు అప్రమత్తంగా వ్యవహరించాలని కొత్తవలస మండలం వియ్యం పేట ఆరోగ్య కేంద్రం వైద్యులు పద్మావతి, జగదాంబ కోరారు. మంగళవారం పిహెచ్సీలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ ప్రతి నెల డెలివరీల సంఖ్య పెంచాలని, టీబీ వ్యాధిగ్రస్తులకు సకాలంలో మందులు అందజేయాలని, కుష్టు వ్యాధిగ్రస్తులను గుర్తించాలని కోరారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్