గుజరాత్లోని ఈదర్ ప్రాంతం జాదర్ సమీపంలో సోమవారం షాకింగ్ ఘటన జరిగింది. పెట్రోల్ బంక్లో ఇంధనం నింపుకునేందుకు వాహనాలు భారీగా ఉన్నాయి. ఆ సమయంలో ఓ ప్యాసింజర్ వ్యాన్ అదుపు తప్పింది. ఒక్కసారిగా పెట్రోల్ బంక్లోని కస్టమర్ల వైపు దూసుకెళ్లింది. ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తులను ఆ వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.