ఆర్మీ కొత్త చీఫ్‌గా ఉపేంద్ర ద్వివేది

74చూసినవారు
ఆర్మీ కొత్త చీఫ్‌గా ఉపేంద్ర ద్వివేది
భారత ఆర్మీ కొత్త చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేదిని నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన ఆర్మీ స్టాఫ్ వైస్ చీఫ్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుత చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ మనోజ్ సి పాండే జూన్ 30న పదవీ విరమణ చేయనున్నారు. ఆ తర్వాత ఉపేంద్ర ద్వివేది బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయన 1984లో ఆర్మీ (జమ్మూ & కాశ్మీర్ రైఫిల్స్)లో నియమితులయ్యారు. నాలుగు దశాబ్దాలుగా ఆర్మీలో వివిధ హోదాల్లో సేవలందించారు.

సంబంధిత పోస్ట్