ఏసీబీ కార్యాలయ సమీపంలో కొండచిలువ

55చూసినవారు
ఏసీబీ కార్యాలయ సమీపంలో కొండచిలువ
విశాఖలోని ఏసీబీ కార్యాలయ సమీపంలో కొండచిలువ కలకలం సృష్టించింది. జీవీఎంసీ జోన్‌`2, 9వ వార్డు ఎండాడ`ఆదర్శనగర్‌ ప్రాంతంలో పంప్‌ హౌస్‌ ఉంది. శనివారం మధ్యాహ్నం పంప్‌ హౌస్‌ నుంచి నీటిని విడుదల చేసేందుకు అక్కడి ఇన్‌స్పెక్టర్‌ నరేష్‌ కిందకు దిగాడు. 12 అడుగుల కొండచిలువ అక్కడ కనిపించడంతో బెంబేలెత్తిపోయాడు. సమాచారాన్ని స్నేక్‌ కేచర్‌ కిరణ్‌కు తెలుపగా కొండచిలువను పట్టుకుని, అనంతరం అడవిలో వదిలేశాడు.

సంబంధిత పోస్ట్