సీజనల్ వ్యాధులపై అవగాహన
By విక్కీ 77చూసినవారువిశాఖ జిల్లా మధురవాడలో సీజనల్ వ్యాధులపై శుక్రవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఫ్రైడే డ్రైడేగా పాటించాలని ర్యాలీలో నినాదాలు చేశారు. 5వ వార్డు కార్పొరేటర్ ఎం. హేమలత మాట్లాడుతూ. కీటక జనిత వ్యాధులు నివారణకు దోమలను నిర్మూలించాలన్నారు. దోమల నిర్మూలంతో మలేరియా డెంగ్యూ వ్యాధులను నివారించవచ్చునన్నారు. పరిశుభ్రత పాటించాలని పేర్కొన్నారు.