క్షేత్ర స్థాయి పర్యటనలో భాగంగా విశాఖ వీఎంఆర్డీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ కె. ఎస్ విశ్వనాథన్, కొత్తవలస, నిడిగట్టు, కాపులఉప్పాడ, పరదేశిపాలెం తదితర గ్రామాల్లో మంగళవారం పర్యటించారు. సంస్థకు చెందిన భూములను అధికారులతో కలిసి పరిశీలించారు. ఫెన్సింగ్ వేసి భూములను పరిరక్షించే దిశగా చర్యలు చేపట్టాలన్నారు. అదేవిధంగా న్యాయపరమైన చిక్కులు వల్ల కలుగుతున్న ఇబ్బందిని అధిగమించాలని ఆదేశించారు.