మబ్బుల్లో విశాఖ నగరం

69చూసినవారు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా విశాఖలో శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. నగరాన్ని మబ్బులు కమ్ముకున్నాయి. ముఖ్యంగా విశాఖ బీచ్‌, సింహాచలం గిరులపై దట్టంగా మబ్బులు కమ్ముకున్నాయి. కాసేపు వానజల్లు కురిశాయి. మొత్తానికి వాతావరణం మొత్తం చల్లబడింది. శుక్రవారం రాత్రి నుంచి ఉత్తరాంధ్ర వ్యాప్తంగా ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్