ఏ. ఎల్. పురం హైస్కూల్లో వన మహోత్సవ కార్యక్రమం

65చూసినవారు
గొలుగొండ మండలం కృష్ణాదేవిపేట అటవీ శాఖ రేంజ్ అధికారి సుంకర వెంకట్రావు ఆద్వర్యంలో శుక్రవారం వన మహోత్సవం కార్యక్రమాన్ని ఏ ఎల్ పురం హైస్కూల్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎ ఎల్ పురం హైస్కూల్లో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో డిఆర్వో సత్యనారాయణ, సెక్షన్ అధికారి లక్ష్మన్ జనసేన పార్టీ సమన్వయకర్త రాజాన వీర సూర్య చంద్ర సీనియర్ నాయకులు రేగుబళ్ళు సాంబ శివ సలాదుల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్