చేపలు మాంసం దుకాణాలను తనిఖీలు చేసిన అధికారులు

56చూసినవారు
నర్సీపట్నంలో ఆదివారం ఉదయం సానిటరీ విభాగానికి చెందిన అధికారులు, సిబ్బంది మాంసం దుకాణాలను తనిఖీ చేశారు. మున్సిపల్ కమిషనర్ సురేంద్ర ఆదేశాల మేరకు తనిఖీలు చేపడుతున్నట్లు సానిటరీ ఇన్స్పెక్టర్ చిట్టిబాబు తెలిపారు. చెడిపోయిన చేపలు మాంసం విక్రయిస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదులు మేరకు తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. తాజా చేపలను మాత్రమే విక్రయించాలని సూచించారు. లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్