కంబవలస గిరిజనులకు వంతెన కష్టాలు

51చూసినవారు
డుంబ్రిగుడ మండలంలోని పలు గ్రామాల్లో వంతెన లేక గిరిజనులు రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండలంలోని కించుమండ పంచాయతీ పరిధి కంబవలసకి వెళ్లే వాగుపై వంతెన లేక గిరిజనులు రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటూ అతికష్టం మీద వాగు దాటి తమ అవసరాలను తీర్చుకుంటున్నారు. ఈ వాగుపై వంతెన నిర్మాణం చేపట్టాలని అధికారులకు ఎన్నోసార్లు విన్నవించిన పట్టించుకోలేదని ఇప్పటికైనా అధికారులు స్పందించాలని గిరిజనులు సోమవారం కోరారు.

సంబంధిత పోస్ట్