కొత్తూరు పంచాయతీలో సిఐటియు ఆధ్వర్యంలో శాఖ మహాసభలు

56చూసినవారు
కొత్తూరు పంచాయతీలో సిఐటియు ఆధ్వర్యంలో శాఖ మహాసభలు
అనంతగిరి: కొత్తూరు పంచాయతీలో సోమవారం సిఐటియు శాఖ మహాసభ నిర్వహించారు. సీపీఎం పార్టీ నాయకులు టోకూరు సర్పంచ్ కిల్లో మోస్య మాట్లాడుతూ కొత్తూరు పంచాయతీ పరిధిలోని తీగలమాడ, చిటలగరువు, వంటల మామిడి, తోటవలస, గ్రామాలలో సాగు రైతులకు ఫారెస్టు పోడు పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అటవీ హక్కుల చట్టం తీసుకొచ్చి 18 సంవత్సరాలు దాటిన నేటికీ సగం మంది రైతులకు అధికారులు పట్టాలు మంజూరు చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు.

సంబంధిత పోస్ట్