చెరువులో శవమై తేలిన వ్యక్తి

76చూసినవారు
చెరువులో శవమై తేలిన వ్యక్తి
పద్మనాభం మండలం బి. ఆర్. తాళ్ళవలస గ్రామంలో ఓ వ్యక్తి మృతి చెందారు. గ్రామానికి చెందిన చింతపల్లి నాగరాజు మంగళవారం రాత్రి ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. బుధవారం మధ్యాహ్నం గ్రామానికి ఆనుకొని ఉన్న చెన్నా చెరువులో శవమై తేలాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. బహిర్భూమి కి వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తు జారీ మృతి చెందినట్లుగా భావిస్తున్నారు.

సంబంధిత పోస్ట్