భీమిలి: రోడ్డుపై వర్తకుల బైఠాయింపు

66చూసినవారు
భీమిలి: రోడ్డుపై వర్తకుల బైఠాయింపు
మ‌ధుర‌వాడ జివిఎంసి కార్యాలయం వద్ద ప్రతి శనివారం నిర్వహించే వారంతపు సంత వర్తకులను పోలీసులు మళ్లీ అడ్డుకున్నారు. దీంతో తీవ్రవేదనకు గురైన సంత నిర్వాహకులు సిఐటియు ఆధ్వర్యాన సేవా రహదారిలో బైఠాయించారు. రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. సిఐ కాంతారావు వచ్చి వర్తకులతో మాట్లాడారు. ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా కొంత స్థలం వదిలి పెట్టి సంత నిర్వహించుకోవాలని చెప్పడంతో వర్తకులు ఆందోళన విరమించారు.

సంబంధిత పోస్ట్