చింతపల్లి మండలం కొమ్మేంగి గ్రామ సచివాలయం పరిధిలో శుక్రవారం 8 మంది వాలంటీర్లు రాజీనామా పత్రాన్ని మండల అభివృద్ధి అధికారి వారికి అందజేశారు. అనంతరం వైసీపీ గెలుపే లక్ష్యంగా పనిచేసి వైఎస్ జగన్మోహన్రెడ్డి ని రెండవ సారి ముఖ్యమంత్రిగా చేసుకోవడం కోసం ప్రచారానికి సిద్ధపడినట్లుగా వారు తెలిపారు.