ఘనంగా సామూహిక మహా లింగార్చన

85చూసినవారు
ఘనంగా సామూహిక మహా లింగార్చన
చోడవరం మండలం పి.ఎస్.పేట బ్రాహ్మణ వీధిలో వేంచేసియున్న శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానంలో జరుగుతున్న 133వ గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా సోమవారం విభూది అలంకారంలో స్వామి దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా భక్తులచే సామూహికంగా మహాన్యాస పూర్వక ఏకవార లింగార్చన ఘనంగా నిర్వహించారు. గణపతి నవరాత్రుల సందర్భంగా ప్రతీ రోజూ వేకువ జామునే లక్ష్మీ గణపతి హోమం, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు కమిటీ అధ్యక్షుడు తెలిపారు.

సంబంధిత పోస్ట్