హత్యాయత్నం కేసులో ముద్దాయికి ఐదేళ్లు శిక్ష

78చూసినవారు
హత్యాయత్నం కేసులో ముద్దాయికి ఐదేళ్లు శిక్ష
హత్యా ప్రయత్నం కేసులో ముద్దాయికి 5 ఏళ్లు కఠిన కారాగార శిక్ష, 5వేలు జరిమానా విధిస్తూ చోడవరం అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి
ఈ. రాజేంద్రబాబు బుధవారం తీర్పునిచ్చారు. ఒకవేళ జరిమానా కట్టని సమక్షంలో 6 నెలలు సాధారణ జైలు శిక్ష అనుభవించాలని తీర్పునిచ్చారు. దీనిపై 2021 జూలై 29న బుచ్చయ్యపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి విచారణ అనంతరం తీర్పు చెప్పారు.

సంబంధిత పోస్ట్