రాష్ట్ర స్థాయి జూడో పోటీలో విద్యార్థి ప్రతిభ

82చూసినవారు
రాష్ట్ర స్థాయి జూడో పోటీలో విద్యార్థి ప్రతిభ
తిరుపతి జిల్లాలో ఈ నెల 22, 23 న జరిగిన అండర్ -14 బాల బాలికల స్కూల్ గేమ్స్ లో రాష్ట్ర స్థాయి జూడో పోటీలో బుచ్చయ్యపేట మండలం వడ్డాది విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. 49 కేజీ ల విభాగం నుండి 8 వ తరగతి చదువుతున్న గోడ చరణ్ అనే విద్యార్థి రజత పతకంతో ద్వితీయ స్థానం సాధించాడు. ఈ సందర్బంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కు పేరు తెచ్చిన విద్యార్థిని, పాఠశాల ఇన్ ఛార్జ్ హెడ్ మాస్టర్ వెంకటరావు తదితరులు బుధవారం అభినందించారు.

సంబంధిత పోస్ట్