ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తాం- ఎమ్మెల్యే రాజు

76చూసినవారు
చోడవరం నియోజకవర్గాన్ని సస్యశ్యామలంగా మార్చి ప్రతి ఎకరాకు సాగునీరందిస్తామని టీడీపీ ఎమ్మెల్యే కె ఎస్ ఎన్ ఎస్ రాజు అన్నారు. శనివారం రావికమతం మండలం రావికమతం గ్రామాల్లో విత్తనాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి గ్రామంలో రైతు సుఖసంతోషాలతో ఉండేలాగా తెలుగుదేశం, జనసేన, బిజెపి కూటమి ప్రభుత్వం పని చేస్తుందని ఎమ్మెల్యే రాజు చెప్పారు. టిడిపి మండల పార్టీ అధ్యక్షుడు రాజన్న కొండ నాయుడు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్