విశాఖ జిల్లా భీమునిపట్నం తెదేపా అభ్యర్థి గంటా శ్రీనివాసరావు కార్యాలయంలో మహిళలతో గంటా సతీమణి శారద ఆత్మీయ సమావేశం నిర్వహించారు. తన భరర్త గంటా శ్రీనివాసరావును గెలిపించాలని అభ్యర్థించారు. నియోజవకర్గంనుంచి భారీగీ మహిళలు తరలివచ్చారు. ఇంతవరకు ఓటమి ఎరుగని గంటాకు మీరంతా మళ్లీ ఆశీస్సులు అందజేయాలని, కూటికి అధికారంలోకి రావడం ఖాయమని, మనకు మళ్లీ మంచిరోజులు రానున్నాయని ఆమె పేర్కొన్నారు.