గుజరాత్లో ఎన్నికల కాంపెయినర్లుగా ఆమ్ ఆద్మీ పార్టీ 40 మందితో కూడిన జాబితాను ఎన్నికల సంఘానికి అందజేసింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా, మాజీ మంత్రి సత్యేందర్ జైన్లను సైతం ఆ జాబితాలో చేర్చింది. వీరితో పాటు కేజ్రీవాల్ సతీమణి సునీత, పంజాబ్ సీఎం భగవంత్ మాన్లూ ఉన్నారు. ఆప్ రాజ్యసభ ఎంపీలు సంజయ్ సింగ్, రాఘవ్ చద్దా, సందీప్ పాఠక్ల పేర్లను ఈ జాబితాలో పొందుపరిచింది.