ఛత్తీస్గఢ్లోని కాంకేర్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ఇప్పటి వరకు 29 మంది మృతి చెందినట్లు సమాచారం. ఘటనా స్థలంలో ఏకే 47, ఇతర అధునాతన ఆయుధాలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. బీఎస్ఎఫ్ దళాల కూంబింగ్ కొనసాగుతోంది. మృతుల్లో మావోయిస్టు కీలక నేత శంకర్రావు కూడా ఉన్నారని, అతడి మీద రూ.25 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.