స్టీల్ ప్లాంట్ కార్మికుల రాస్తారోకో

66చూసినవారు
స్టీల్ ప్లాంట్ కార్మికుల రాస్తారోకో
విశాఖ ఉక్కు పరిరక్షణలో భాగంగా కార్మికులు మంగళవారం భారీ స్థాయిలో ఆందోళన నిర్వహించారు. విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని కార్మికులు డిమాండ్ చేశారు. కార్మిక సంఘాల నేతలు తరలిరావడంతో కూర్మన్నపాలెంలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఇప్పటికే పలువురు కార్మికులను పోలీసులు అరెస్ట్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఆందోళనకారులు ఎండగట్టారు.

సంబంధిత పోస్ట్