ఓటర్ల మేలు మర్చిపోలేను
పెద్దఎత్తున ఓటు హక్కును వినియోగించుకుంటూ. విశాఖ ప్రగతి కోసం కదంతొక్కిన ఓటర్లు ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటారని వైసీపీ విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ అన్నారు. ప్రచారం ప్రారంభమైన నాటి నుంచి నా గెలుపును కాంక్షిస్తూ సహకరించిన పార్టీ శ్రేణులకు, నేతలకు, కార్యకర్తలకు ఆమె మంగళవారం విశాఖలో కృతజ్ఞతలు తెలిపారు. విశాఖకు మంచి జరగాలని మనసారా కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.