నర్సీపట్నంలో 359వ రోజుకు చేరుకున్న అన్న క్యాంటీన్

63చూసినవారు
నర్సీపట్నంలో అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు నిర్వహిస్తున్న మొబైల్ అన్నా క్యాంటీన్ నిర్విఘ్నంగా కొనసాగుతుంది. బుధవారం నాటికి 359 రోజుకు చేరుకుంది. గత ప్రభుత్వ హయంలో అన్న క్యాంటీన్లను ఎత్తివేయడంతో స్పీకర్ అయ్యన్న సొంత నిధులతో క్యాంటీన్ ప్రారంభించారు. ఏరియా ఆసుపత్రి ఎదురుగా మొబైల్ కాంటీన్ అందుబాటులో ఉంటుంది. కేవలం రెండు రూపాయలకే భోజనం అందిస్తుండడంతో మధ్యాహ్నం పూట ప్రజలు భారీగా తరలివస్తున్నారు.

సంబంధిత పోస్ట్