రహదారి పై ప్రవహిస్తున్న వరద నీరు

60చూసినవారు
గత మూడు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. నాతవరం మండలం గన్నవరం మెట్ట వద్ద గెడ్డ నర్సీపట్నం - తుని రహదారిపై ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో రాకపోకులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గతంలో కూడా ఇక్కడ ఈ గెడ్డ ఉదృతంగా ప్రవహించడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ సమస్య పరిష్కారానికి ఇక్కడ వంతెన నిర్మించాలని పలువురు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్