డ్రైనేజీ, కులాయి పైపులకు స్థలం కేటాయించకపోవడంతో గ్రామస్తుల ఆందోళన

70చూసినవారు
అనకాపల్లి జిల్లా నాతవరం మండలం చమ్మ చింత గ్రామంలో ఆర్ అండ్ బి రోడ్డు పనులు వేగంగా జరుగుతున్నాయి. కానీ రోడ్లు ఇరువైపులా డ్రైనేజీకి, కులాయి పైపుల ఏర్పాటుకు తగిన స్థలం కేటాయించకపోవడంతో సోమవారం గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్డు పక్కన డ్రైనేజీకి, కుళాయిల పైపులకు తగిన స్థలం ఏర్పాటు చేస్తేనే రోడ్డు పనులకు సహకరిస్తామని 10 మీటర్ల రోడ్డు వేసి డ్రైనేజీ నిర్మించాలని లేకపోతే కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్