విశాఖ జివిఎంసిలో ఇకపై నిత్యం ప్రజా సమస్యలను స్వీకరించేందుకు జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో గల హెల్ప్ డెస్క్ను జీవీఎంసీ కమిషనర్ పి. సంపత్ కుమార్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ ప్రజలకు కల్పించే మౌలిక సదుపాయాలు, ప్రజా సంక్షేమ పథకాలలో కలిగే ఇబ్బందులు, అంతరాయాలను ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రతి రోజూ అర్జీలు, ఫిర్యాదులు చేయవచ్చన్నారు.